6 యెహోవా సేవకుడు మోషే, ఇశ్రాయేలీయులూ వారిని ఓడించారు. యెహోవా సేవకుడు మోషే, ఆ భూమిని రూబేనీయులకూ గాదీయులకూ మనష్షే అర్థగోత్రపు వారికీ స్వాస్థ్యంగా ఇచ్చాడు. 7 యొర్దానుకు అవతల, అంటే పడమరగా లెబానోను లోయలో ఉన్న బయల్గాదు నుండి శేయీరు వరకూ వ్యాపించిన హాలాకు కొండవరకూ ఉన్న దేశాల రాజులను యెహోషువ, ఇశ్రాయేలీయులు జయించారు. యెహోషువ దాన్ని ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం స్వాస్థ్యంగా ఇచ్చాడు. 8 కొండ ప్రాంతాల్లో, లోయలో షెఫేలా ప్రదేశంలో చరియల ప్రదేశాల్లో అరణ్యంలో దక్షిణ దేశంలో ఉన్న హిత్తీయులూ అమోరీయులూ కనానీయులూ పెరిజ్జీయులూ హివ్వీయులూ యెబూసీయులూ అనేవారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకున్నారు. 9 వారెవరంటే, యెరికో రాజు, బేతేలు పక్కన ఉన్న హాయి రాజు, యెరూషలేము రాజు, 10 హెబ్రోను రాజు, యర్మూతు రాజు, 11 లాకీషు రాజు, ఎగ్లోను రాజు, 12 గెజెరు రాజు, దెబీరు రాజు, 13 గెదెరు రాజు, హోర్మా రాజు, 14 అరాదు రాజు, లిబ్నా రాజు, 15 అదుల్లాము రాజు, మక్కేదా రాజు, 16 బేతేలు రాజు, తప్పూయ రాజు, 17 హెపెరు రాజు, ఆఫెకు రాజు, 18 లష్షారోను రాజు, మాదోను రాజు, 19 హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు, 20 అక్షాపు రాజు, తానాకు రాజు, 21 మెగిద్దో రాజు, కెదెషు రాజు. 22 కర్మెలులో యొక్నెయాము రాజు, దోరు మెరక ప్రాంతాల్లో ఉన్న దోరు రాజు, 23 గిల్గాలులో గోయీయుల రాజు, తిర్సా రాజు. 24 వారంతా కలిసి ముప్ఫై ఒక్క మంది రాజులు.
<- యెహోషువా 11యెహోషువా 13 ->